కుప్పంలో హైటెన్షన్..
By - Subba Reddy |25 April 2023 7:30 AM GMT
నిన్న వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంపై.. టీడీపీ తీవ్రంగా మండిపడుతోంది
కుప్పంలో హైటెన్షన్ నెలకొంది. నిన్న వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంపై.. టీడీపీ తీవ్రంగా మండిపడుతోంది. వైసీపీ దుశ్చర్యలపై కుప్పం టీడీపీ కార్యాలయంలో అత్యవసరంగా పార్టీ నేతలు సమావేశమవుతున్నారు. నాలుగు మండలాల నుంచి భారీగా టీడీపీ శ్రేణులు కుప్పం చేరుకున్నారు. దీంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. అదనపు బలగాలను కూడా రంగంలోకి దించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com