నరరూప రాక్షసుడొచ్చాడు సీఎం జగన్పై బాబు ఘాటు వ్యాఖ్యలు

ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్తు ఇచ్చేది టీడీపీనే అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.. అమరావతి అనగానే ఒళ్లు పులకరించిందన్నారు.. అమరావతిని ధ్వంసం చేయడానికి నరరూప రాక్షసుడు వచ్చాడంటూ జగన్ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ సత్తెనపల్లిలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో పాటు రోడ్ షోలో పాల్గొంటారు. ఇక రేపు 27న తాడికొండలో చంద్రబాబు పర్యటిస్తారు. టీడీపీ అధినేత వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల్లో వైసీపీ అరాచకాలను చంద్రబాబు దృష్టికి తీసుకురానున్నారు. మరోవైపు అధినేత పర్యటనతో కార్యకర్తలో జోష్ పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com