AP : జగన్ నిర్లక్ష్యమే రైతులను నిండాముంచింది : చంద్రబాబు

AP : జగన్  నిర్లక్ష్యమే రైతులను నిండాముంచింది : చంద్రబాబు

జగన్ సర్కార్‌ నిర్లక్ష్యమే రైతులను నిండాముంచిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. రైతులతో కలిసి పాదయాత్ర చేసిన చంద్రబాబు.. అనంతరం తణుకు బహిరంగ సభలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు కన్నీళ్లకు కారణం వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. రైతులను విస్మరించిన జగన్‌కు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. 72 గంటల డెడ్‌లైన్‌ ఇచ్చినా ముఖ్యమంత్రిలో చలనం లేదని మండిపడ్డారు. పంటను కాపాడేందుకు రైతులు భయంతో నిద్రలేని రాత్రులు గడిపితే.. చేతకాని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచి హక్కులు కాపాడుకునే పోరాటానికి రైతులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ రైతు పోరుబాటే జగన్‌ పార్టీకి అంతిమ యాత్రగా మారబోతోందన్నారు. రైతులకు పంటనష్ట పరిహారం ఇచ్చే వరకు పోరు ఆగదని చంద్రబాబు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story