AP : టీడీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడి..!
![AP : టీడీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడి..! AP : టీడీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడి..!](https://www.tv5news.in/h-upload/2023/04/28/955365-654564.webp)
కుప్పంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడికి తెగబడుతున్నారు.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో టీడీపీ నాయకుడు జగన్ ఇంటిపై అర్థరాత్రి 50 మంది వైసీపీ మూక దాడికి తెగబడింది. ఇంట్లోకి చొరబడి వస్తువులు ధ్వంసం చేశారు.. మూక దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పరామర్శించారు.. అయితే, పరామర్శకు వెళ్లి వచ్చిన తర్వాత మరోసారి జగన్ ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం కలకలం రేపుతోంది. టీడీపీ కార్యకర్తలపై దాడిచేసిన వారి మీద వెంటనే కేసు నమోదు చేయాలని కంచర్ల శ్రీకాంత్ డిమాండ్ చేస్తున్నారు.
మూడు రోజుల క్రితం వైసీపీ నాయకులు చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా, ప్రతిగా టీడీపీ శ్రేణులు కూడా సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.. అయితే, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులకుక తెగబడుతున్నారు.. పలర్లపల్లికి చెందిన టీడీపీ వార్డు కార్యదర్శి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడని కక్ష పెంచుకుని వైసీపీ కార్యకర్తలు అతని ఇంటిపై దాడి చేశారు.. కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచారు.. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు గ్రామానికి వెళ్లి బాధితుణ్ని పరామర్శించారు. ఇలా టీడీపీ నాయకులు పరామర్శించి వెళ్లగానే మరోసారి వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి.. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com