వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు : వంగలపూడి అనిత

X
By - Vijayanand |19 Feb 2023 3:00 PM IST
వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత అన్నారు. కాకినాడ జిల్లా కాట్రేనికోనలో గ్యాంగ్ రేప్కు గురైన బాధితురాలిని పరామర్శించిన అనిత.. వైసీపీ అధికారంలోకి వచ్చాకు రెండు వేల మందికి పైగా మహిళలపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఇక మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన నిందితులు.. కేసును కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు ఇస్తే తప్పు ఒప్పు అవుతుందా అని ప్రశ్నించారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com