Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..

Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..
Tirupati: తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సి.మల్లవరం సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు

Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సి.మల్లవరం సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు రాష్ట్రం ఈ రోడ్డుకు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు.. తిరుమల శ్రీవారి దర్శనానికి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లి, కుమారులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉనట్లు తెలుస్తోంది. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story