జగన్ అనుచరులు విశాఖలో భూదోపిడీ చేస్తున్నారు : అచ్చెన్నాయుడు
By - Nagesh Swarna |14 Dec 2020 4:06 PM GMT
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన దుర్బుద్దితో అమరావతిని చంపేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాజధాని నిర్మాణంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే.. ఇన్నాళ్లు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ అనుచరులు మూడు రాజధానుల పేరుతో విశాఖలో భూదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం మొండిగా విద్యుత్ మీటర్లను పెడితే రైతులు ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com