సీఎం జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ అచ్చెన్నాయుడు
By - Nagesh Swarna |12 Jan 2021 10:22 AM GMT
వైసీపీ నేతల వేడుకలకు రాని కరోనా.. ఎన్నికలు నిర్వహిస్తే వస్తుందా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీలే దేవాలయాలను ధ్వంసం చేస్తున్నాయన్న సీఎం జగన్ ఆరోపణలపై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. తెల్లారి లేస్తే రాష్ట్రంలో ఏదో ఒక విధ్వంసం జరిగితేనే ఆయన నిద్రపడుతుందని.. ఆయన పాలన విధ్వంసంతోనే ప్రారంభమైందని.. విమర్శించారు. ప్రజా వేదిక కూల్చి.. ప్రజలు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన నీచ సంస్కృతి వైసీపీదని విమర్శించారు. వైసీపీ నేతల వేడుకలకు రాని కరోనా.. ఎన్నికలు నిర్వహిస్తే వస్తుందా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com