Alamuru SI Ashok : రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి

X
By - Manikanta |26 Jun 2025 11:30 AM IST
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎం. అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గంజాయి కేసుకు సంబంధించి నిందితుల కోసం కానిస్టేబుల్స్ తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తుండగా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.ఎస్ఐ అశోక్ తో పాటు ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతిచెందినవారిలో ఎస్సై అశోక్ స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కాగా, ఉద్యోగరీత్యా రాజమండ్రిలో ఉంటున్నారు, ఆయనకు భార్య ఇద్దరు కుమారులు. మరో మృతుడు కానిస్టేబుల్ బ్లేస్సన్ అంబేద్కర్ కొనసీమజిల్లా ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి, ఈయనకు ఇంకా వివాహం కాలేదు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com