Andhra Pradesh : రామనవమి వేడుకల్లో అగ్ని ప్రమాదం

Andhra Pradesh : రామనవమి వేడుకల్లో అగ్ని ప్రమాదం

రామనవమి వేడుకల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరిలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తెస్తున్నారు. గురువారం ఉదయం వేణుగోపాల స్వామి గుడిలో రామనవమి వేడుకలు జరిపేందుకు టెంట్లు, పందిరి ఏర్పాటుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా టెంట్లకు మంటలు వ్యాపించినట్లు తెలిపారు. ఆలయంలో మంటలు వ్యాపించడంతో భక్తులు భయానికి గురయ్యారు. పిల్లలు, మహిళలు, భక్తులు అరుపులతో ప్రాంగణంలో గందరగోళం ఏర్పడింది. అయితే భక్తులకు ఎలాంటి గాయాలు కాలేవని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story