Ys Jagan : విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం : సీఎం జగన్‌

Ys Jagan : విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం : సీఎం జగన్‌
Ys jagan : అభివృద్ధి వికేంద్రీకరణ అనే మూల సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం జగన్‌ తేల్చిచెప్పారు.

Ys jagan : అభివృద్ధి వికేంద్రీకరణ అనే మూల సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం జగన్‌ తేల్చిచెప్పారు. ఆ ఉద్దేశ్యంతోనే మూడు రాజధానుల బిల్లులు తీసుకువచ్చామని, అందులోని కొన్ని అంశాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు సీఎం జగన్‌. మళ్లీ పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లుతో వస్తామన్నారాయన. అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తామని, పూర్తి సమగ్రమైన బిల్లు తెస్తామన్నారు. ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. మూడు రాజధానుల బిల్లును మెరుగు పరుస్తామన్నారు సీఎం జగన్‌.

Tags

Read MoreRead Less
Next Story