Andhra Pradesh: ఏపీ రాజ్యసభ బెర్తులు ఖరారు..? నలుగురు నేతలు ఫిక్స్..?

X
By - Divya Reddy |17 May 2022 7:15 PM IST
Andhra Pradesh: మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికకు పంపే నేతల పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది
Andhra Pradesh: మార్చిలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పెద్దల సభకు పంపే నేతల పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండగా..అధికార వైసీపీకే నాలుగు స్థానాలు దక్కనున్నాయి. అయితే మూడు స్థానాలకు ఇప్పటికే ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. మూడు స్థానాలకే ఎంపిక చేయడం వెనుక వ్యూహమేంటన్నదానిపై చర్చ జోరందుకుంది. నాలుగో బెర్త్ ఎవరికో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే నాలుగో స్థానానికి రేసులో ఆర్.కృష్ణయ్యతోపాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com