AP : గుంటూరులో పొలిటికల్ హీట్... టీడీపీ, వైసీపీ మధ్య సవాళ్ల పర్వం

X
By - Vijayanand |4 April 2023 2:07 PM IST
అక్రమాలపై దమ్ముంటే చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. నజీర్ మహమ్మద్ సవాల్ను వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా స్వీకరించారు
టీడీపీ, వైసీపీ నేతల సవాళ్ల పర్వంతో గుంటూరులో పొలిటికల్ హీట్ పెరిగింది. గుంటూరు బీఆర్ స్టేడియం అంజుమన్ కమిటీ బిల్డింగ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అంజుమాన్ సంస్థ ఆస్తుల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ అధికార ప్రతినిధి నజీర్ మహమ్మద్ ఆరోపించారు. అక్రమాలపై దమ్ముంటే చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. నజీర్ మహమ్మద్ సవాల్ను వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా స్వీకరించారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్లతో గుంటూరులో హై టెన్షన్ నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com