ఏపీ అసెంబ్లీలో పోలవరంపై తీవ్రమైన చర్చ

ఏపీ అసెంబ్లీలో పోలవరంపై తీవ్రమైన చర్చ

పోలవరంపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును... అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ విధానాలవల్లే ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పోలవరం విషయంలో ఎక్కడా రాజీపడలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే పనులు ప్రారంభమయ్యాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయమన్నారు చంద్రబాబు. 7 ముంపు మండలాలను ఏపీలోకి తీసుకురాకపోయి ఉంటే.. ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదన్నారు. 2013 ముగిసే నాటికే టెండర్లు పిలిచారని చంద్రబాబు గుర్తుచేశారు.



Tags

Read MoreRead Less
Next Story