CBN: నేడు బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ

CBN: నేడు బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ
X
ప్రధాని సహా కేంద్రమంత్రులతోనూ భేటీ.. ఏపీ రూపు మార్చే ఒప్పందాలు ఉంటాయని ప్రచారం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ, బిల్‍గేట్స్ ను సీఎం చంద్రబాబు కలవనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బిల్‍గేట్స్ తో చంద్రబాబు భేటీ అవుతారు. బిల్‌గేట్స్ సహాయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టించిన సీఎం చంద్రబాబు... నేడు ఐదు కీలక రంగాల్లో ఒప్పందాలు చేసుకోబోతున్నారు. ఇవి ఏపీ రూపు మారుస్తాయని భావిస్తున్నారు.

ప్రధానితో చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు.. ప్రధానితోనూ భేటీ కానున్నారు. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహాయ నిధులతో పాటు పలు ముఖ్య అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సమాచారం. అమరావతి పునర్నిర్మాణ వేడుకకు రావాలని మోదీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అలాగే హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు.

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణను అమలు చేసి ఎస్సీ 59 ఉపకులాలకు సామాజిక న్యాయం పాటించిన ఘనత, సీఎం చంద్రబాబుకే దక్కిందని, ఎమ్మిగనూరు తెలుగుదేశం నాయకులు కదిరికోట ఆదెన్న పేర్కొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర, బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, చిత్రపటాలతో పాటు CM చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.

Tags

Next Story