CBN: కిరాతకుల్ని వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు

CBN: కిరాతకుల్ని వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు
X

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యోదంతంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు వెళ్లిన ముఖ్యమంత్రి.. వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో ముమ్మర దర్యాప్తు జరుగుతోందని, 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హత్య చేసింది స్థానికులా.. కిరాయి గూండాలా.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హింసకు తావులేదన్నారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

53 కత్తిపోట్లు

కరడుగట్టిన నేరస్థులు సైతం చేయని రీతిలో వీరయ్య చౌదరీని హత్య చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భౌతికకాయంపై 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయన్నారు. ఏపీలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా? అనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. వీరయ్య చౌదరి మంచి నాయకుడని... సమర్థమంతమైన వ్యక్తి అని తెలిపారు. యువగళం సందర్భంలో 100 రోజుల పాటు లోకేశ్‌తో తిరిగారని గుర్తు చేసుకున్నారు.

Tags

Next Story