AP: డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరు చూపించాం

AP: డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరు చూపించాం
X
వైభవంగా సుపరిపాలనలో తొలి అడుగు...పాల్గొన్న చంద్రబాబు, పవన్, లోకేశ్‌... ఏడాది సంక్షేమంపై కూటమి సర్కార్ సమీక్ష

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో డబు­ల్ ఇం­జి­న్ సర్కా­రు ఎలా ఉం­టుం­దో ఏడా­ది పా­ల­న­లో­నే చూ­పిం­చా­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. సు­ప­రి­పా­ల­న­లో తొలి అడు­గు పే­రిట ఏడా­ది పా­ల­న­పై చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన సద­స్సు జరి­గిం­ది. ఈ సద­స్సు­లో డి­ప్యూ­టీ సీఎం పవన్ కళ్యా­ణ్, పు­రం­ధ­రే­శ్వ­రి, లో­కే­ష్ సహా మం­త్రు­లు, ఎం­పీ­లు, ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­లు, సీ­ఎ­స్, ఉన్న­తా­ధి­కా­రు­లు, హె­చ్వో­డీ­లు, కలె­క్ట­ర్లు, ఎస్పీ­లు, కా­ర్పొ­రే­ష­న్ల ఛై­ర్మ­న్లు.. డై­రె­క్ట­ర్లు హా­జ­ర­య్యా­రు. ఈ సమా­వే­శం­లో ఏడా­ది సం­క్షే­మం­పై సమీ­క్ష… అభి­వృ­ద్ధి­పై అవ­లో­క­నం, భవి­ష్య­త్ కా­ర్యా­చ­ర­ణ­పై చర్చిం­చా­రు. సు­ప­రి­పా­ల­న­లో తొలి అడు­గు సమా­వే­శం­లో ఏడా­ది పా­ల­న­పై చర్చిం­చు కుం­టు­న్నా­మ­ని చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. సూ­ప­ర్ సి­క్స్‌­లో ఎన్ని­కల హా­మీ­లు ఇచ్చా­మ­ని... వా­టి­ని అమలు చే­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. ప్ర­భు­త్వం ప్ర­జ­ల­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని ముం­దు­కు వె­ళ్ళా­ల­న్న చం­ద్ర­బా­బు... అస్త­వ్య­స్తం­గా ఉన్న ఆర్ధిక వ్య­వ­స్థ­ను చక్క­బె­ట్టే ప్ర­య­త్నం చే­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. అన్ని చే­శా­మ­ని చె­ప్ప­డం లే­ద­న్న బాబు... ఊహిం­చిన దాని కన్నా ఎక్కు­వే చే­శా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. మూడు రా­జ­ధా­ను­లు ఎక్క­డా సక్సె­స్ కా­లే­ద­న్నా­రు ఏపీ సీఎం చం­ద్ర­బా­బు. మూడు రా­జ­ధా­ను­లం­టూ మూడు ము­క్క­లాట ఆడా­ర­ని మం­డి­ప­డ్డా­రు. చి­వ­ర­కు రా­ష్ట్రా­ని­కి కే­పి­ట­ల్‌ లే­కుం­డా చే­శా­ర­ని ఫైర్ అయ్యా­రు. ఏ రా­జ­కీయ నా­య­కు­డి­కై­నా సంపద సృ­ష్టిం­చి.. ఆదా­యం పెం­చి­తే­నే సం­క్షేమ పథ­కా­లు అమలు చేసే హక్కు ఉం­టుం­ద­న్నా­రు. నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని .. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్ర విజన్‌- 2047ను లక్ష్యంగా పెట్టుకున్నామని.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించామన్నారు.

ఆటో డ్రై­వ­ర్లు, మహి­ళ­ల­కు గుడ్ న్యూ­స్

ఏపీ­లో­ని ఆటో డ్రై­వ­ర్లు, మహి­ళ­ల­కు చం­ద్ర­బా­బు గుడ్ న్యూ­స్ ప్ర­క­టిం­చా­రు. ఆటో డ్రై­వ­ర్ల­కు ఆగ­స్టు 15న ఆర్థిక సాయం అం­ది­స్తా­మ­ని తె­లి­పా­రు. అలా­గే మహి­ళ­ల­కు అదే రోజు నుం­చి ఉచి­తం­గా బస్సు ప్ర­యా­ణం సౌ­క­ర్యం కల్పి­స్తా­మ­ని చం­ద్ర­బా­బు స్ప­ష్టం చే­శా­రు. గత ఎన్ని­క­ల­కు ముం­దు మహి­ళ­ల­కు ఉచి­తం­గా ఆర్టీ­సీ బస్సు ప్ర­యా­ణం కల్పి­స్తా­మ­ని చె­ప్పా­మ­ని, ఈ హా­మీ­ని నె­ర­వే­ర్చేం­దు­కు కృషి చే­స్తు­న్నా­మ­ని చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. సమా­జం­లో ఆర్థిక అస­మా­న­త­లు భా­రీ­గా పె­రు­గు­తు­న్నా­య­ని, పే­ద­లు మరింత పే­ద­రి­కం­లో కూ­రు­కు­పో­తు­న్నా­ర­ని , ధన­వం­తు­లు ఇంకా ఇంకా ధని­కు­లు­గా మా­రి­పో­తు­న్నా­ర­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. గ్రా­మా­ల్లో మనతో పు­ట్టి­న­వా­ళ్లు ఇంకా పే­ద­రి­కం­లో­నే మగ్గి­పో­తు­న్నా­ర­న్నా­రు. అలాం­టి వా­రి­కి సమా­జం అం­డ­గా ని­ల­బ­డా­ల­ని ఆకా­క్షిం­చా­రు. బిల్ గే­ట్స్ తాను సం­పా­దిం­చిన దాం­ట్లో 99 శాతం డబ్బు­లు సమా­జా­ని­కే ఇస్తు­న్నా­ర­ని చం­ద్ర­బా­బు చె­ప్పా­రు.

Tags

Next Story