AP Corona: ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్త కేసులు..

AP Corona: ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్త కేసులు..
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 84,232 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా..

AP Corona: ఏపీలో కరోనా వైరస్ కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 84,232 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 13,400 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారిన పడి 94 మంది ప్రాణాలు కోల్పోయారు. 21,133 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, అనంతపురంలో 8 మంది, తూర్సు గోదావరిలో 8 మంది, శ్రీకాకుళంలో 8 మంది, విశాఖపట్నంలో 8 మంది, కృష్ణాలో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, గుంటూరులో నలుగురు, కడప జిల్లాలో నలుగురు మృతి చెందారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,91,72,843 శాంపిల్స్ పరీక్షించగా.. 16,82,247 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిలో 15,05,620 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 10,832 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,65,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story