AP: ఏపీ రాజకీయాల్లో శనివారం అలజడి

ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు విధించారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ విధిస్తూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 25 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అప్పటివరకు నిరసనలు, సభలు ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జగన్ శనివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. లడ్డూ రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చేందుకని జగన్ ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు.
ఆయన స్వయంగా శ్రీవారిని దర్శించుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఇప్పటికే ఆయనపై హిందూ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత ఏమిటో ఆయన ఇంటిపై పడిన కాషాయ రంగే చెబుతోంది. ఇలాంటి సమయంలో తిరుమలకు వెళ్లేందుకు సిద్ధపడటం రాజకీయంగా చాలా ఆలోచనలేని నిర్ణయమని ఎక్కువ మందిభావన. ఎందుకంటే.. అక్కడ డిక్లరేషన్ వివాదం వస్తుంది.. ఆయనను అడ్డుకోవడానికి హిందువులు వస్తారు.. కొండపై భక్తులూ ప్రశ్నిస్తారు. ఈ ప్రమాదాల్ని ఏ మాత్రం ఊహించకుండా.. తిరుమల టూర్ కు రెడీ అయ్యారు. ఈ టూర్లో తిరుమలలో లేదా..తిరుపతిలో ఉద్రిక్తతలు తలెత్తితే అది ఖచ్చితంగా వైసీపీనే పడుతుంది. దాని వల్ల రాజకీయంగా జరిగే నష్టం చాలా ఎక్కువ.
ఏపీ రాజకీయాల్లో "శనివారం" అలజడి
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు శనివారం అలజడి రేపుతోంది. మాజీ సీఎం జగన్.. శనివారం శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నారు. జగన్ తిరుమల పర్యటన వేళ... డిక్లరేషన్ ఇవ్వాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోంది. జగన్ ఏ మతస్థుడో డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా డిమాండ్ చేశారు. ఇటు వైసీపీ నేతలు కూడా తాము కచ్చితంగా తిరుమలకు పోతామని.. ఏం చేస్తారో చూస్తామని అంటున్నారు. దీంతో అలజడి రేగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com