AP: జగన్ ‘లెక్కలు’ తేల్చిన లోకేశ్

వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని.. అందినకాడికి అప్పులు చేశారని ఆరోపించారు. 58 ఏళ్లపాటు పాలించిన సీఎంలు అంతా కలిపి చేసిన అప్పుపై రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుంటే.. జగన్ చేసిన అప్పుపై రూ.24,944 కోట్ల వడ్డీలు కడుతున్నామని లోకేశ్ తెలిపారు. జగన్ ఆర్థిక విధ్వంసానికి ఇది నిదర్శనమన్నారు.
మహా కుంభమేళాకు మంత్రి లోకేశ్
మంత్రి నారా లోకేశ్ కాసేపట్లో యూపీ ప్రయాగ్రాజ్లోని షాహి స్నాన ఘట్టానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రయాగ్రాజ్ నుంచి వారణాసికి వెళ్లనున్నారు. మ. 2.45 గంటలకు వారణాసిలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శించనున్నారు. సా. 3.40 గంటలకు వారణాసి కాశీవిశ్వేశ్వర ఆలయ సందర్శన, ప్రత్యేక పూజలు చేయనున్నారు. సా. 5.25 గంటలకు వారణాసి నుంచి విజయవాడ తిరుగు ప్రయాణం కానున్నారు.
టీడీపీ కొత్త వ్యూహం!
మంత్రి నారా లోకేశ్ టీడీపీ కీలక నేతల్లో ఒకరు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు తరువాత నెంబర్ 2 లోకేశే అని చెప్పాలి. ఈ క్రమంలో లోకేశ్ కోసం టీడీపీ కొత్త వ్యూహంతో ముందుకెళ్తుందని తెలుస్తోంది. ప్రజల్లో లోకేశ్ తిరిగే విధానం, వారికి అందిస్తున్న సేవలు, ఇతర కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా బలంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో లోకేశ్ క్రేజ్ మరింత పెరుగుతుందని టీడీపీ భావిస్తోందట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com