లాక్ డౌన్ పెడితే ప్రజల ప్రాణాలు నిలుస్తాయి : ఏపీ టీడీపీ

X
By - TV5 Digital Team |8 May 2021 4:00 PM IST
కరోనా టీకా, ఆక్సిజన్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ టీడీపీ నేతలు ఎవరి ఇళ్ల వద్ద వారు నిరసనలు చేస్తున్నారు.
కరోనా టీకా, ఆక్సిజన్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ టీడీపీ నేతలు ఎవరి ఇళ్ల వద్ద వారు నిరసనలు చేస్తున్నారు. టీకా పంపిణీలో సర్కారు విఫలమైందని, ఉచిత టీకా ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్ హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. పూర్తి లాక్ డౌన్ పెడితే ప్రజల ప్రాణాలు నిలుస్తాయని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు సూచించారు. ప్రశ్నించే వారిపై కేసులు కాకుండా, సమస్యలు పరిష్కరించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. అటు ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com