Tirupati: తిరుపతి జిల్లాలో ఘటన.. దాదాపు పదివేల బాతులు మృతి..

X
By - Divya Reddy |5 Aug 2022 5:45 PM IST
Tirupati: తిరుపతి జిల్లా పెళ్లకూరులో మేతకు వెళ్లిన పదివేల బాతులు మృతిచెందాయి.
Tirupati: తిరుపతి జిల్లా పెళ్లకూరులో మేతకు వెళ్లిన పదివేల బాతులు మృతిచెందాయి. పెళ్లకూరు మండలం రావులపాడులో మనిరాజా,అంజలి దంపతులు బాతులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు..ఎప్పటిలాగే శుక్రవారం కూడా బాతులను మేతకు తీసుకువెళ్లి చెరువులోకి వదిలారు. కొద్దిసేపు తరువాత చూస్తే బాతులు మృత్యవాత పడ్డాయి. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చిన మునిరాజా విషప్రయోగం జరిగిందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. చనిపోయిన బాతుల విలువ దాదీపు 15లక్షలకు వరకు ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com