Supreme Court : వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్

రాజంపేట లోక్సభ వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. లొంగిపోవడానికి సమయమిచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు విముఖత చూపింది. మద్యం కేసులో ముందస్తు బెయిలు కోసం మిథున్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2024 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మద్యం పంపిణీకి సంబంధించి మిథున్రెడ్డిపై కేసు నమోదైంది. మద్యం పంపిణీకి ఆర్థిక సహాయం అందించారని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అరెస్ట్ నుండి రక్షణ కోరుతూ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అక్కడ ఆయనకు ఊరట లభించకపోవడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com