CBN: నన్ను లేపేస్తావా.. ఇక్కడున్నది చంద్రబాబు

CBN: నన్ను లేపేస్తావా.. ఇక్కడున్నది చంద్రబాబు
X
జగన్‌పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం...పశువులా.. లేక మనుషులా..?... అన్నదాత సుఖీభవ ప్రారంభం.. జగన్‌వి గొడ్డలిపోటు రాజకీయాలు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రై­తు­ల­కు సాం­కే­తిక పరి­జ్ఞా­నా­న్ని అం­దు­బా­టు­లో­కి తీ­సు­కొ­స్తా­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ప్ర­కా­శం జి­ల్లా దర్శి మం­డ­లం తూ­ర్పు వీ­రా­య­పా­లెం­లో ‘అన్న­దాత సు­ఖీ­భవ’ పథ­కా­న్ని సీఎం చం­ద్ర­బా­బు ప్రా­రం­భిం­చా­రు. లబ్ధి­దా­రు­ల­కు చె­క్కు­లు అం­ద­జే­సిన అనం­త­రం.. పొ­లాల వద్ద వి­నూ­త్నం­గా ఏర్పా­టు చే­సిన వే­ది­క­పై రై­తు­ల­తో ము­ఖా­ము­ఖి ని­ర్వ­హిం­చా­రు. రై­తుల చె­ప్పిన సమ­స్య­ల­పై స్పం­దిం­చిన సీఎం.. వా­టి­ని పరి­ష్క­రిం­చా­ల­ని అక్క­డి­క­క్క­డే అధి­కా­రు­ల­కు ఆదే­శా­లు జారీ చే­శా­రు. రై­తు­ల­కు లాభం వచ్చే­లా ఏ పంట వే­యా­లో అధ్య­య­నం చేసి చె­బు­తా­మ­న్నా­రు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీనికి తోడుగా కేంద్రం ‘పీఎం కిసాన్‌’ పథకం కింద మొదటి విడతగా రూ.2 వేల చొప్పున రైతులకు సాయం అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7 వేలు చొప్పున జమ చేశాయి. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందించనున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఎన్నికల ముందు రాక్షస పాలన చూశామని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఇబ్బందిపడుతూ పెన్షన్లు పెంచారని అయితే కూటమి పాలనలో ఒక్కసారే పెన్షన్లు పెంచామని ప్రజలకు వివరించారు.

జగన్ నుంచి ఏం నేర్చుకోవాలి

రా­జ­కీ­యా­లు ప్ర­జల కోసం పని­చే­యా­ల­ని అన్నా­రు. వారి అం­తిమ లక్ష్యం అధి­కా­రం అయి­నా కట్టు­బా­ట్లు, పద్ద­తు­లు, నై­తి­క­వి­లు­వ­లు తప్ప­ని­స­రి­గా ఉం­డా­ల­న్నా­రు. తనను చూసి వా­టి­ని నే­ర్చు­కో­వా­ల­న్నా­రు. కానీ జగన్ ను చూసి ఏం నే­ర్చు­కుం­టా­ర­ని ప్ర­శ్నిం­చా­రు. గొ­డ్డ­లి పో­ట్లు, రప్పా రప్పా, బూతు పం­చాం­గం నే­ర్చు­కుం­టా­రా అని ప్ర­శ్నిం­చా­రు. మా­వా­ళ్ల­కు చె­బి­తే లే­పే­స్తా­ర­ని అం­టు­న్నా­ర­ని..ను­వ్వు లే­పే­స్తా­వా.. ఇక్కడ ఉన్న­ది సీ­బీ­ఎ­న్ అంటూ హె­చ్చ­రిం­చా­రు. తాను ఎంతో మం­ది­తో పో­రా­డా­న­ని చె­ప్పా­రు. తీ­వ్ర­వా­దు­లు, కమ్యు­న­ల్ గొ­డ­వ­లు సృ­ష్టిం­చే­వా­ళ్ల­‌­తో పో­రా­డా­న­ని అన్నా­రు. ఇప్పు­డు నే­ర­‌­స్థు­లు రా­జ­‌­కీయ ము­సు­గు­లో వ‌­స్తు­న్నా­ర­‌­ని, వా­ళ్ల ము­సు­గు తీసి నే­ర­‌­స్తు­ల­‌­ను నే­ర­‌­స్తు­లు­గా ప‌­రి­గ­‌­ణిం­చా­ల­‌­ని చె­బు­తు­న్నా­న­‌­ని అన్నా­రు. ఎమ్మె­ల్యే ప్ర­శాం­తి రె­డ్డి వ్య­క్తి గత జీ­వి­తా­న్ని ఒక మాజీ ఎమ్మె­ల్యే వి­మ­ర్శిం­చా­డ­ని.. అతను పశు­వు­వా లేకా మని­షా అర్థం కా­వ­డం లే­ద­ని చం­ద్ర­బా­బు సీ­రి­య­స్ కా­మెం­ట్స్ చే­శా­రు. నే­నై­తే మరో­సా­రి అలాం­టి­వి జర­గ­కుం­డా మం­ద­లిం­చే­వా­డి­ని అని కానీ జగన్ ఆ మాజీ ఎమ్మె­ల్యే ఇం­టి­కి వె­ళ్ళి పరా­మ­ర్శిం­చా­డ­ని అన్నా­రు. అవ­స­ర­మై­తే ఇళ్ల­ల్లో­కి వె­ళ్లి టీ­డీ­పీ వా­ళ్ళ­ని లే­పే­స్తా­మ­ని జగన్ అన్నా­డ­ని, నేను ఒక­సా­రి ఏమా­రి­తే నా­రా­సుర రక్త చరి­త్ర అని జగన్ తన పత్రి­క­లో రా­శా­ర­ని చం­ద్ర­బా­బు కా­మెం­ట్స్ చే­శా­రు. జగన్ లే­పే­స్తే చూ­స్తూ ఊరు­కో­మ­ని ఇక్కడ ఉం­డే­ది సీ­బీ­ఎ­న్ అని చం­ద్ర­బా­బు హె­చ్చ­రిం­చా­రు. ము­సు­గు­లు తొ­ల­గిం­చా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని చం­ద్ర­బా­బు వ్యా­ఖ్యా­నిం­చా­రు.

Tags

Next Story