AP: భోగి వేడుకల్లో చంద్రబాబు-పవన్
ఆంధ్రప్రదేశ్లో రాతియుగం పోయి స్వర్ణయుగం త్వరలోనే వస్తుందని..... తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతం మందడంలో భోగి సంబరాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు గంగిరెద్దులు, సంక్రాంతి ముగ్గులు, పొంగళ్లతో రాజధాని రైతులు, తెలుగుదేశం,జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
భోగి మంటలను ఇద్దరు నేతలు కలిసి వెలిగించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను చంద్రబాబు, పవన్.....భోగి మంటల్లో తగలపెట్టారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాజధాని గ్రామాల ప్రజలు, ఇరు పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతీ ఒక్కరూ 87రోజులు పాటు గట్టిగా పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
4ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడ, కీడుని భోగి మంటల్లో తగలపెట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే సంక్రాంతిని తెలుగుదేశం-జనసేన ప్రభుత్వంలో ఘనంగా జరుపుకుందామని ఆకాంక్షించారు.AP: భోగి వేడుకల్లో చంద్రబాబు-పవన్
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com