AP: ఏపీ ప్రయోజనాలే నాకు ముఖ్యం: చంద్రబాబు

బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దగా పడ్డ ఏపీ ప్రయోజనాలే ఇప్పుడు తనకు ముఖ్యమన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకొచ్చి సెట్ చేయడమే తన ముందున్న లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. తనపై పెద్ద బాధ్యత ఉన్నప్పుడు.. పెద్ద ఆలోచనలూ అవసరమన్న చంద్రబాబు.. ఎవరెవరో మాట్లాడే వాటికి ఇప్పుడు స్పందించి చులకన కాదల్చుకోలేదన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం, ప్రజలు గట్టిగా ఉంటే… కేంద్రం ఎందుకు దిగిరాదనటానికి జల్లికట్టు ఘటనే ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. గత నాలుగున్నరేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి పోరాటానికి కనీసం ప్రయత్నం చేశాడా? అని ప్రశ్నించారు. ఓట్ల అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వదిలిపెట్టమని.. అక్రమాలు సరిదిద్దకపోతే ఎన్నికల సంఘం విశ్వసనీయత కూడా పోతుందన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com