Chandrababu: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. బోటులో వెళ్తుండగా..

Chandrababu: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. బోటులో వెళ్తుండగా..
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది..

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.. ఆయనతోపాటు టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న బోటు గోదావరిలో బోల్తా పడింది.. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పశ్చిమ గోదావరి జిల్లా సోంపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.. వరద బాధితులను పరామర్శించేందుకు నేతలంతా బోటులో వెళ్లారు.. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది.

ఒక బోటులో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు పలువురు ముఖ్య నేతలు ఉండగా, మరో బోటులో మాజీ మంత్రులు దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, మంతెన రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణతోపాటు పలువురు టీడీపీ నేతలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు.. సోంపల్లి దగ్గర బోటు దిగే సమయంలో రెండు బోట్లు ఢీకొన్నాయి.. దీంతో రెండో బోటులో ఉన్నవారంతా నదిలో పడిపోయారు.. అయితే, లోతు తక్కువగా ఉండటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.. లైఫ్‌ జాకెట్ల సాయంతో నీళ్లలో పడిపోయిన వారిని కాపాడారు. మరో బోటులో టీడీపీ అధినేత చంద్రబాబును పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story