ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
ఏపీ సీఎం జగన్‌కు ప్రతిపక్షనేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించిన విషయం తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు ప్రతిపక్షనేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన దివ్యస్మృతికి నివాళిగా నెల్లూరులో మ్యూజికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్పీబాలు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి.. ఆయన పేరు మీద కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ఎస్పీ బాలు పేరిట జాతీయ పురస్కారం అందజేయాలని లేఖలో చంద్రబాబు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story