పోలీసుల దాడిలో గాయపడిన మహిళలకు చంద్రబాబు పరామర్శ

అమరావతి కట్టింది ఒక్కడి కోసం కాదని.. 5 కోట్ల ఆంధ్రుల కోసమని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన అమరావతి మహిళా రైతులను పరామర్శించిన ఆయన.. మహిళలపై దాడులు అమానుషమన్నారు. భూములను త్యాగం చేసిన వారిపై దాడులేంటని ప్రశ్నించారు.
జగన్ అవినీతి సామ్రాజ్యంలో అమరావతి మహిళలు ఏమైనా భాగం అడిగారా అని నిలదేశారు. ప్రపంచంలో సుధీర్ఘమైన ఉద్యమం అమరావతిదే అన్న చంద్రబాబు.. అన్ని రోజులు జగన్రెడ్డిది కాదన్న సత్యాన్ని గుర్తించుకోవాలన్నారు. అమరావతిపై తన కష్టం మొత్తం బూడిదలో పోసినట్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైజాగ్ స్టీల్ప్లాంట్ విషయంలో అడ్డంగా దొరికిపోయిన జగన్.. తాము నాటిన చెట్లకు నీళ్లు కూడా పోయలేదని విమర్శించారు. కొందరు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని.. అన్ని రికార్డ్సు తమ వద్ద ఉన్నాయని.. ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. దేవుడు అనేవాడు ఉంటే అమరావతి ఇక్కడే ఉంటుందన్న చంద్రబాబు.. రాజధాని పోరాటాన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆపొద్దని స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com