నేడు గుడివాడలో బాబు గర్జన
By - Subba Reddy |13 April 2023 3:00 AM GMT
ఇవాళ చంద్రబాబు గుడివాడ గడ్డపై గర్జించనున్నారు. రెండు రోజులపాటు గుడివాడలోనే ఉండనున్నారు
కొంత గ్యాప్ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు.అపూర్వ జనాధరణ మధ్య జగన్ సర్కార్ను తూర్పార పడ్తున్నారు. ఇవాళ చంద్రబాబు గుడివాడ గడ్డపై గర్జించనున్నారు. రెండు రోజులపాటు గుడివాడలోనే ఉండనున్నారు. భారీ రోడ్ షో… ఆ తర్వాత భారీ బహిరంగ సభతో గుడివాడ జనాలతో మమేకం కానున్నారు. ఇప్పటికే టీడీపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. గుడివాడ మొత్తం పసుపుమయం అయ్యింది. చంద్రబాబు గుడివాడ టూర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొడాలి నానికి వచ్చే ఎన్నికల్లో షాక్ ఇస్తామంటున్న టీడీపీ నేతలు.. చంద్రబాబు టూర్ను సక్సెస్ చేసేందుకు అంతర్గత విభేదాలన్నింటినీ పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com