Chandrababu : ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకుని వేధించడం దుర్మార్గం..!

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu : ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను వదిలిపెట్టి ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకుని వేధించడం దుర్మార్గమన్నారు

Chandrababu : ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను వదిలిపెట్టి ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకుని వేధించడం దుర్మార్గమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. కుప్పంలో నోట్ల కట్టలు పంచుతూ పట్టుబడిన వైసీపీ నేతలను అదుపులోకి తీసుకోకుండా టీడీపీ కేడర్‌ను పోలీసులు బెదించడం అనైకతిమన్నారు.

దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం నేరమా అని ప్రశ్నించారు.. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.. అలాగే నెల్లూరులో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా వ్యవహరిస్తున్న కప్పిర శ్రీనివాసులు అనే టీడీపీ నాయకుణ్ని మంత్రి అనిల్‌ వారం రోజులుగా పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వేధించడం వైసీపీ నాయకుల శాడిస్టు, సైకో మనస్తత్వానికి నిదర్శమన్నారు చంద్రబాబు.

వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు.. శ్రీనివాసులుకు ఎలాంటి ప్రాణహాని జరిగినా మంత్రి అనిల్‌ కుమార్‌ బాధ్యత వహించాలన్నారు.. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు న్యాయస్థానం ముందు తలొంచుకుని నిలబడాల్సి వస్తుందన్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story