సొంత నియోజకవర్గంలో బాబు దూకుడు

సొంత నియోజకవర్గంలో బాబు దూకుడు
కుప్పంలో టీడీపీ స్పీడు పెంచింది. అవును.. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు దూకుడు పెంచారు

కుప్పంలో టీడీపీ స్పీడు పెంచింది. అవును.. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా రేపటి నుంచి మూడ్రోజులపాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కాగా ఈ మధ్యే కుప్పంలో సంస్థాగతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసిన టీడీపీ,... సమన్వయ కమిటీని నియమించింది. ముఖ్యంగా కుప్పంలో ఈసారి లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది టీడీపీ. ఈ నేపథ్యంలో నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఇప్పట్నుంచే ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతేకాదు దాదాపు 60 రోజుల పాటు ప్రజల్లో తిరిగేలా వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు.

చంద్రబాబు పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఫ్లెక్సీలు, పాంప్లేట్ల రూపంలో ప్రజలకు గుర్తు చేసే విధంగా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టేలా ప్లాన్ చేశారు. చంద్రబాబు కూడా ఈ మూడు రోజులు కుప్పంలో పార్టీ బలోపేతంతో పాటు పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు ఈ పర్యటనలో భారీగా చేరికలు జరగనున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పిన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బీఆర్‌ సురేష్ బాబు తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు వైసీపీ నుంచి కూడా చేరికలు ఉంటాయని తెలుస్తుంది. కాగా.. రేపు కుప్పం ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు.


Tags

Read MoreRead Less
Next Story