CBN: నేడు ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

CBN: నేడు ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ
X
ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ప్రతినిధులతోనూ ఏపీ సీఎం భేటీ... ఉన్నతాధికారులతోనూ వరుస సమీక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ సచివాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీపై రివ్యూ చేస్తారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధులు భేటీ కానున్నారు. నేటి నుంచి ఈ నెల 27 వరకు అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ADB ప్రతినిధులు పర్యటించనున్నారు. 3రోజులపాటు రాజధానిలో రెండు బ్యాంకుల ప్రతినిధులు ఉండనున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ADB ప్రతినిధులు రుణం సమకూర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వం, CRDA ఉన్నతాధికారులతో బృందం వరుసగా భేటీ కానుంది.

పవన్‌ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకేరోజున 13326 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరులో జరిగే గ్రామసభకు హాజరుకానున్నారు. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకే రోజున 13326 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వేకోడూరులో జరిగే గ్రామసభకు హాజరుకానున్నారు.

23న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరి వారిపల్లె గ్రామసభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. మోడల్ పంచాయతిగా మైసూరివారిపల్లె నిలిచింది. డిప్యూటి సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా.. గ్రామసభపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా పరిషత్‌ సీఈఓలు, డీపీఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు తదితరులతో పవన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల్లో పనిచేయడమంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుపేద కూలీలకు సేవ చేయడమేనని తాను నమ్ముతున్నట్లు పవన్ తెలిపారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తామని పవన్‌ తెలిపారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికీ సంవత్సరంలో 100రోజుల పని దినాలను కల్పిస్తున్న అంశంపై అవగాహన కల్పించడంతో పాటు, అధికారులు కూలీలకు గల హక్కుల గురించి తెలియజేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపారు.


Tags

Next Story