అధినేత రాకతో పసుపుమయంగా నూజివీడు

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.. నూజివీడు మొత్తం పసుపుమయంగా మారింది. పట్టణంలో ఎటు చూసినా చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, బెలూన్లు దర్శనమిస్తున్నాయి. పోలీస్ శాఖ సుమారు 500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. నూజివీడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు సభా ఏర్పాట్లతో పాటు.. రోడ్ షో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు కోసం వచ్చే టీడీపీ శ్రేణులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా 20 వేల మందికి పైగా భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో.. 40 వేలకు పైగా మజ్జిక ప్యాకెట్లను సిద్ధం చేశారు. విస్సన్నపేట బైపాస్ రోడ్డు నుంచి.. కొప్పుల వేలంపేట మీదుగా పెద్ద గాంధీ బొమ్మ సెంటర్, చిన్న గాంధీ బొమ్మ సెంటర్ చేరుకుని.. అక్కడ చంద్రబాబు సింగ్ హోటల్లో టీ తాగనున్నారు. అక్కడి నుంచి పాదయాత్రగా బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్తారని టీడీపీ నేతలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com