Chandrababu: అక్రమ క్వారీలపై దృష్టి సారించిన చంద్రబాబు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ..

X
By - Divya Reddy |30 May 2022 9:26 PM IST
Chandrababu: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
Chandrababu: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమ క్వారీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు తెలిపారు. గుడిపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 10 గ్రానైట్ లారీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఎన్ని విధాలుగా దాడులు చేస్తున్నా అక్రమార్కులు యథేచ్ఛగా గ్రానైట్ను తరలిస్తున్నారని చంద్రబాబు.. సీఎస్కు రాసిన లేఖలో వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ క్వారీలను అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com