Chandrababu: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు.. ఎలక్షన్ కమిషనర్‌కు చంద్రబాబు లేఖ..

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu:కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. 14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేష్ పై వైసీపీ దాడి చేసిందన్నారు. 30మంది వైసీపీ లీడర్లు తమ అభ్యర్థిపై దాడి చేశారన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు చంద్రబాబు. దాడికి సంబంధించిన ఫోటోలను లేఖకు జత చేశారు.

కుప్పం మున్సిపాలిటీని చేజిక్కించుకోడానికి ప్రత్యర్ధులు అరాచకాలకు దిగుతున్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులో టీడీపీ అభ్యర్థి వెంకటేష్‌పై దాడి జరిగింది. నామినేషన్ వేయడానికి వచ్చిన తనపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారంటూ వెంకటేష్‌ ఆరోపించారు. టీడీపీ అభ్యర్ధిపై దాడి జరగడంతో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడు వెంకటేష్‌ని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి పరామర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story