Chandrababu: తమిళనాడు సీఎం స్టాలిన్కు చంద్రబాబు లేఖ.. రైస్ మాఫియా విషయంలో..

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు.. తమిళనాడు సీఎం స్టాలిన్కు లేఖ రాశారు. తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందంటూ లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు. ఏయే రూట్లలో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా రైస్ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్కు రాసిన లేఖకు జత చేసి పంపారు.
తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తోందని.. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా సరిగా లేకపోవడంతో రైస్ మాఫియా రెచ్చిపోతోందని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఏపీలో రైస్ మిల్లర్లకు పంపుతున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లు బియ్యాన్ని పాలిష్ చేసి రైస్ మాఫియాకు పంపి బహిరంగ మార్కెట్లో ప్రజలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని అన్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో కిలో 40 రూపాయలకు అమ్ముతున్నారన్నారు.
రేషన్ మాఫియాకు సంబంధించి నిత్యావసర వస్తువుల చట్టం కింద కుప్పంలో దాదాపు 13 కేసులు నమోదయ్యాయని తెలిపారు. స్థానిక ప్రజలు సైతం చాలామంది స్మగ్లర్లను పట్టుకుంటున్నా..ఏపీలో అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతోందని.. తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నిఘా పెంచాలని స్టాలిన్కు సూచించారు. రేషన్ రైస్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు సీఎస్తో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా చంద్రబాబు లేఖ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com