అసెంబ్లీలో వైసీపీ నేతలు శునకానందం పొందుతున్నారు : సీఎం రమేష్

అసెంబ్లీలో వైసీపీ నేతలు శునకానందం పొందుతున్నారు : సీఎం రమేష్
C.M Ramesh on Rains : ఏపీలో వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నా జగన్ ప్రభుత్వానికి చలనం లేదంటూ మండిపడ్డారు ఎంపీ సీఎం రమేష్.

C.M Ramesh on Rains : ఏపీలో వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నా జగన్ ప్రభుత్వానికి చలనం లేదంటూ మండిపడ్డారు ఎంపీ సీఎం రమేష్. ప్రాణ నష్టం, ఆస్తినష్టం, ఎన్ని మూగజీవాలు చనిపోయాయన్న వివరాలు సైతం అధికారికంగా వెల్లడించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రాజెక్టులకు కొట్టుకుపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని కామెంట్ చేశారు. కనీసం అప్రమత్తం చేసే వాళ్లు కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతుంటే.. అసెంబ్లీలో వైసీపీ నేతలు శునకానందంద పొందుతున్నారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story