'నా ఉద్యోగం పోయినా ఫర్వాలేదు'.. చంద్రబాబుకు జరిగిన అవమానంపై కానిస్టేబుల్ తీవ్ర ఆవేదన..!

X
By - TV5 Digital Team |20 Nov 2021 10:38 AM IST
AP constable : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పట్ల అసెంబ్లీలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరును అందరూ తప్పు పడుతున్నారు.
AP constable : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పట్ల అసెంబ్లీలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరును అందరూ తప్పు పడుతున్నారు. చంద్రబాబుకు జరిగిన అవమానంపై ప్రకాశం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ విజయకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. బాబు హయాంలోనే తనకు ఉద్యోగం వచ్చిందని గుర్తు చేసుకున్నారు కానిస్టేబుల్. వైసీపీ సర్కార్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సభలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించిన తీరు సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. నైతిక విలువలు మరిచి ప్రవర్తించారన్నారు. తన ఉద్యోగం పోయినా పర్వా లేదన్నాడు. వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థ కూడా దారుణంగా తయారయిందన్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com