ఏపీలో కరోనా మరణమృదంగం

X
ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. ప్రతీరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,368 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 4,45,139కు చేరింది. అటు, ఒక్కరోజులోనే 84 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా మృతుల సంఖ్య 4053కి చేరింది. గడిచన 24 గంటల్లో 9350 మంది కరోనాతో కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 3,39,876 కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 101210 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
