విశాఖలో మావోయిస్టుల లేఖ కలకలం..!

X
By - TV5 Digital Team |22 April 2021 3:30 PM IST
విశాఖలో మావోయిస్టుల లేక కలకలం సృష్టించింది. విశాఖ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరిట లేఖ విడుదలైంది.
విశాఖలో మావోయిస్టుల లేక కలకలం సృష్టించింది. విశాఖ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరిట లేఖ విడుదలైంది. వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు ఓట్ల కోసం, అధికారం కోసం.. 97 జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటంచి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు బూటకపు సంస్కరణలతో ప్రజలను మభ్యపెడుతూ.. మరోవైపు అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసి ప్రజల సంపదను కొల్లగొట్టేందుకు చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా మన్యంలో ఖనిజాలను తవ్వితీసి ప్రజలకు మనుగడ లేకుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని.. అందులో భాగంగానే మాకవరపాలెంలో ఆన్ రాక్ కంపెనీకి ఖనిజాన్ని సప్లై చేసేందుకు 89 జీవోను జగన్ తీసుకొచ్చారని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలపై రాజకీయ నాయకుల వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com