Andhra Pradesh : ఏపీలో ఇవాళ్టి నుంచే కొత్త రేషన్ కార్డుల పంపీణీ

ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు 25, 2025 నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని ప్రకటించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి, అలాగే పాత రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో రూపొందించబడ్డాయి. ప్రభుత్వం మొదటి విడతలో 10 జిల్లాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం ఒక నిరంతర ప్రక్రియ అని, అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు. దీని కోసం 9552300009 నంబర్కు 'Hi' అని మెసేజ్ పంపితే సరిపోతుంది.ఈ కార్డులు "నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు" పథకం కింద ఇల్లు లేని అర్హులైన పేదవారికి, ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు ఉన్నవారు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు వంటి నిత్యావసర వస్తువులను పొందవచ్చు. అలాగే, ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలకు కూడా అర్హులు అవుతారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com