Operation Kagaar AP Border : ఏపీ సరిహద్దులో భీకర ఎన్ కౌంటర్

‘ఆపరేషన్ కగార్’ మావోయిస్టుల పాలిట శరాఘాతంలా మారింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల సరిహద్దులో ఇవాళ ఉదయం భీకర ఎన్కౌంటర్ జరిగింది. కొండమొదలు, చింతకూరు, కొయ్యలగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్ర నేతలు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అల్లూరి జిల్లా పోలీసులు, గ్రేహౌండ్స్ సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరువర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్, మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలు, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ మెంబర్, మావోయిస్ట్ పార్టీ అగ్రనేత చలపతి భార్య అరుణ బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమెపై రూ.20 లక్షల రివార్డు కూడా ఉంది. ఈ కాల్పుల్లో మరో దళ సభ్యుడు అంజు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com