Nellore: నెల్లూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. మతిస్థిమితం లేని మహిళ సజీవదహనం..

X
By - Divya Reddy |28 Jan 2022 1:30 PM IST
Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలో తీవ్ర విషాదం నెలకొంది.
Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలో తీవ్ర విషాదం నెలకొంది. దర్గా దగ్గర మతిస్థిమితం లేని వ్యక్తుల సంరక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఫాతిమా అనే మహిళ సజీవ దహనం కాగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
అయితే ఈ కేంద్రాన్ని అనధికారంగా నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. మానసిక స్థితి నయం అవుతుందనే నమ్మకంతో ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. బాధిత కుటుంబాల నుంచి వేలకు వేలు తీసుకుంటున్నా.. ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడివారు చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com