AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి ఆరుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని.

AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి ఆరుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. ఈ అసెంబ్లీ సమావేశాల మొత్తానికి నలుగురు సభ్యులను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు సభ్యులపై ఒక్కరోజు సస్పెన్షన్‌ వేటు వేశారు.. సస్పెండ్ అయిన వారిలో బెందాళం అశోక్, అనగాని సత్య ప్రసాద్, వెలగపూడి రామకృష్ణ బాబు, రామరాజు ఉన్నారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే జే బ్రాండ్‌, జంగారెడ్డి గూడెం మరణాలకు సంబంధించి న్యాయ విచారణ జరపాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

స్పీకర్ పొడియం దగ్గరకు వెళ్లారు. పొడియం దగ్గర నినాదాలు చేశారు. పొడియం దగ్గరకు వస్తే చర్యలు తీసుకుంటానని స్పీకర్ హెచ్చరించడంతో తమ స్థానాలకు వెళ్లి నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. దీంతో కలగజేసుకున్న స్పీకర్..సభా గౌరవాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు టీడీపీ సభ్యులను ఈ నెల 25 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story