Good News : రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లలో బియ్యం, కందిపప్పు పంపిణీ

కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను ఏపీ సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజారులో ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం లోని రైతు బజారులో
కందిపప్పు, బియ్యం స్టాల్ ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు.
బియ్యం, కందిపప్పు సబ్సిడీ ధరలకు రైతు బజారులో అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం. నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంది. రైతుబజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కందిపప్పును కేజీ రూ.160, సోనామసూరి బియ్యాన్ని కిలో రూ.49కు రాయితీపై అందించనుంది ప్రభుత్వం.
రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇది ఒక పండుగ అని ఏపీ సివిల్ సప్లై శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. సంక్షేమ పధకాలతో పాటుగా నిత్యవసర సరుకులు సరైన ధరలకి అందించడానికి కృషి చేసామన్నారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్న దానిపైన పోరాటాలు చేసామన్నారు నాదెండ్ల మనోహర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com