ప్రభుత్వ నిర్వాకంతో శిథిలావస్థకు చేరుకున్న బీఆర్‌ స్టేడియం

ప్రభుత్వ నిర్వాకంతో శిథిలావస్థకు చేరుకున్న బీఆర్‌ స్టేడియం
జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిన స్టేడియంలో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని నసీర్ అహ్మద్ అన్నారు

YCP ప్రభుత్వ నిర్వాకంతో గుంటూరు బీఆర్‌ స్టేడియం శిథిలావస్థకు చేరుకుందన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నసీర్ అహ్మద్. జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిన.. స్టేడియంలో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని అన్నారు. క్రీడల శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి రోజా, బైరెడ్డి సిద్దార్థరెడ్డి.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయడం కాదు.. దమ్ముంటే అభివృద్ధిపై సవాళ్లు విసరాలని హితవు పలికారు.

Tags

Read MoreRead Less
Next Story