విశాఖ ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్..!
X
By - TV5 Digital Team |23 April 2021 1:30 PM IST
నగరంలోని 5 ప్రాంతాల్లో ఉన్న భూములు అమ్మడం ద్వారా 15 వందల కోట్లు సమీకరించుకోవాలని భావించిన ప్రభుత్వం, ఇందుకోసం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది.
విశాఖలో విలువైన ప్రభుత్వ భూములు అమ్మాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. ఈ భూముల అమ్మకానికి సంబంధించిన టెండర్లు ఫైనలైజ్ చేయకుండా హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నగరంలోని 5 ప్రాంతాల్లో ఉన్న భూములు అమ్మడం ద్వారా 15 వందల కోట్లు సమీకరించుకోవాలని భావించిన ప్రభుత్వం, ఇందుకోసం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇవాళ ఆ విచారణ సందర్భంగా టెండర్ల ప్రక్రియ ముందుకు తీసుకువెళ్లడానికి వీల్లేదంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com