Hindupur : టీడీపీ ఖాతాలో హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం

X
By - Manikanta |3 Feb 2025 7:00 PM IST
ఏపీలో టీడీపీ జోరు కొనసాగుతోంది. తాజాగా హిందూపూర్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా రమేశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేశ్ ను హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. రమేష్ ను ఛైర్మన్ సీట్లో బాలయ్య కూర్చోబెట్టారు. ఈ రోజు నిర్వహించిన ఓటింగ్ లో టీడీపీకి అనుకూలంగా 23 ఓట్లు వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మికి 14 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి కూడా పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com