టీడీపీ మినీ మేనిఫెస్టోకు భారీ స్పందన

X
By - Bhoopathi |20 Jun 2023 11:15 AM IST
భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది.
భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. టీడీపీ ప్రకటించిన సంక్షేమ పథకాలపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చజరుగుతోంది. ఈ క్రమంలో మినీ మేనిఫెస్టోను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో చైతన్య రథాల్ని ప్రారంభించారు టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఐదు బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. నేటి నుంచి 25 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో ఐదు బస్సులు తిరగనున్నాయి. ఈ బస్సులకు మినీ మేనిఫెస్టోను స్టిక్కర్ల రూపంలో అంటించి ప్రచారం చేయబోతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com